దీపిక పడుకొనే పై దావా వేసిన నిర్మాత !

దీపిక పడుకొనే పై దావా వేసిన నిర్మాత !

Published on Feb 13, 2012 11:38 AM IST


బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పడుకొనే చట్టపరమైన సమస్య ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత రమేష్ తౌరాని ఈమె పై వృత్తిపరమైన దావా వేసారు. ఆయన ప్రస్తుతం రేస్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన భారీ విజయం సాధించిన రేస్ చిత్రానికి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఈ చిత్రంలో దీపిక, సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్ అబ్రహం తో కలిసి నటించాల్సి ఉంది. అయితే దీపిక ఇటీవలే ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఆరు రోజులు షూటింగ్ జరగిన తరువాత ఇలా తప్పుకోవడం సరైనది కాదు అంటూ నిర్మాత ఆరోపిస్తున్నారు. ఆయన సి.ఐ.ఎన్.టి.ఎ.ఎ (సినీ మరియు టీవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) కి ఫిర్యాదు చేసారు. దీపిక సన్నిహితుల సమాచారం ప్రకారం ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆరు నెలలకి పైగా ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమస్య ఎటువైపు దారి తీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు