బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పడుకొనే చట్టపరమైన సమస్య ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత రమేష్ తౌరాని ఈమె పై వృత్తిపరమైన దావా వేసారు. ఆయన ప్రస్తుతం రేస్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన భారీ విజయం సాధించిన రేస్ చిత్రానికి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఈ చిత్రంలో దీపిక, సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్ అబ్రహం తో కలిసి నటించాల్సి ఉంది. అయితే దీపిక ఇటీవలే ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఆరు రోజులు షూటింగ్ జరగిన తరువాత ఇలా తప్పుకోవడం సరైనది కాదు అంటూ నిర్మాత ఆరోపిస్తున్నారు. ఆయన సి.ఐ.ఎన్.టి.ఎ.ఎ (సినీ మరియు టీవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) కి ఫిర్యాదు చేసారు. దీపిక సన్నిహితుల సమాచారం ప్రకారం ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆరు నెలలకి పైగా ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమస్య ఎటువైపు దారి తీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.
దీపిక పడుకొనే పై దావా వేసిన నిర్మాత !
దీపిక పడుకొనే పై దావా వేసిన నిర్మాత !
Published on Feb 13, 2012 11:38 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్
- ఇళయదళపతి తో మూవీ పై వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్