స్టార్ హీరో వ్యాఖ్యలపై నిర్మాతల ఘాటు స్పందన.

స్టార్ హీరో వ్యాఖ్యలపై నిర్మాతల ఘాటు స్పందన.

Published on Sep 5, 2019 12:13 AM IST

హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన నిర్మాతను ఉద్దేశిస్తూ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విషయంలోకి వెళితే ధనుష్ మాట్లాడుతూ నిర్మాతల నుండి డబ్బులు రాబట్టుకోవడం నటులకు కష్టంగా మారుతుందని, చిత్రం పూర్తయిన తరువాత కూడా కొందరు నిర్మాతలు నటుల పారితోషికాలు చెల్లించడం లేదు అన్నారు. అలాగే కొందరు నిర్మాతలు నటులను మోసం చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేయడం జరిగింది.

దీనితో కోపానికి గురైన కొందరు నిర్మాతలు ఎదురు దాడికి దిగారు. అసలు ధనుష్ నిర్మాతల హీరో కాదని ఎద్దేవా చేశారు. ఆయనతో సినిమాలు చేసిన వారు నష్టాల ఊబిలో కూరుకుపోయారు అన్నారు. స్టార్ హీరోలైన అజిత్, విజయ్ లాంటి వారు నిర్మాత బాగోగుల గురించి ఆలోచిస్తారని, కానీ ధనుష్ కి అవేమి పట్టవని వారు ధనుష్ ని తీవ్రంగా విమర్శించడం జరిగింది.

ధనుష్ తాజా చిత్రం ఎనై నోకి పాయం తోట మూవీ ఈనెల 6న విడుదల కానుంది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, తెలుగులో తూటా పేరుతొ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు