హీరో ధనుష్, మేఘా ఆకాష్ జంటగా విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్నై నోకి పాయుమ్ తోట. దర్శకుడు గౌతమ్ మీనన్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేయనున్నారు.
తెలుగులో ఈ చిత్రాన్ని విజయభేరి నిర్మాణ సంస్థ పై తాతారెడ్డి, సత్యనారాయణ రెడ్డి విడుదల చేస్తున్నారు. నేడు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ చిత్ర పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. కాగా త్వరలోనే ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి దుర్బుక శివ స్వరాలు సమకూర్చారు.