ఇంటర్వ్యూ : దర్శకుడు అజయ్ భూపతి – మహేష్ బాబు గారు సినిమా చూసి అదిరిపోయింది అన్నారు.. చివరి 30 నిమిషాలు ఏడ్చేస్తారు..!

ఇంటర్వ్యూ : దర్శకుడు అజయ్ భూపతి – మహేష్ బాబు గారు సినిమా చూసి అదిరిపోయింది అన్నారు.. చివరి 30 నిమిషాలు ఏడ్చేస్తారు..!

Published on Jul 30, 2026 1:07 AM IST

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని వారసుడు జై కృష్ణ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా పరిచయం అవుతుండగా, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విశేషాలను దర్శకుడు అజయ్ భూపతి విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఏ రకమైన కథతో రాబోతోంది?

ఇది ఒక ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు ఇందులో ఉంటాయి.

సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్పందన ఏమిటి?

సినిమా చూసి “అదిరిపోయింది” అని మెసేజ్ చేశారు. ముఖ్యంగా జై కృష్ణ-రాషా జోడీని, పాటలను, యాక్షన్ సీక్వెన్స్‌లను ఎంతో మెచ్చుకున్నారు.

హీరో జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు నటన ఎలా ఉండబోతోంది?

జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. తను సిగ్గరి అయినప్పటికీ మహేష్ బాబు గారిలాగే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ట్రైలర్ చూసిన వారు తను మహేష్ బాబులా కనిపిస్తున్నాడని చెప్పారు.

ఈ సినిమా షూటింగ్ ఏ ఏ లొకేషన్లలో జరిగింది?

మధ్యప్రదేశ్‌లోని చందేరీతో పాటు బళ్లారి, తిరుపతి, మున్నార్ మరియు హైదరాబాద్ వంటి ఒరిజినల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. సౌత్ ఇండియా నుంచి చందేరీలో షూట్ చేసిన తొలి సినిమా ఇదే.

సినిమాలో క్లైమాక్స్ లేదా ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయి?

లాస్ట్ 30 నిమిషాలు ఎమోషనల్‌గా హత్తుకుంటుంది. జై కృష్ణ, మోహన్ బాబు, రాషా మధ్య వచ్చే సన్నివేశాలు చూసి యూత్ కన్నీళ్లు పెట్టుకుంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు