ఆన్లైన్ వర్క్ షాప్ లో పాల్గొన్న కార్తీకేయ, లావణ్య.

ఆన్లైన్ వర్క్ షాప్ లో పాల్గొన్న కార్తీకేయ, లావణ్య.

Published on May 29, 2020 5:20 PM IST


యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగాళ్ళపాటి హీరో కారికేయ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిలకు ఆన్లైన్ వర్క్ షాప్స్ నిర్వహించాడట. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయ మరియు లావణ్య జంటగా నటిస్తున్నారు. క్వారంటైన్ టైం లో ఖాళీగా ఇంటిలో ఉంటున్న వీరిద్దరి కోసం ఆన్లైన్ వర్క్ షాప్ కడక్ట్ చేశాడట. మరి సినిమాలో వీరి పాత్రలు, దానికి సంబంధించిన సన్నద్ధత కోసం ఎలా చేశారు అని తెలుస్తుంది. సినిమాపై మక్కువ అంటే ఇలా ఉండాలి మరి.

జి ఏ 2 ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమ్పరిపిస్తుండగా, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయ బస్తీ బాలరాజు అనే మాస్ రోల్ చేస్తున్నారు. గళ్ళ చొక్కా, లుంగీ ధరించి బస్సు టాప్ పై నుంచున్న కార్తికేయ లుక్ ఆకట్టుకుంది. గత ఏడాది మూడు చిత్రాలు విడుదల చేసిన కార్తికేయ 2020లో చావు కబురు చల్లగా చిత్రంలో నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు