ఆ రీమేక్ లో రెజీనానే నటిస్తోంది !

ఆ రీమేక్ లో రెజీనానే నటిస్తోంది !

Published on Apr 1, 2020 8:21 AM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పటికే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని తెలుగులోకి ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి గ్రాండ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ మరొక కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్ చేసే చేయాలని అనుకుంటున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్రదారులుగా రెజీనా, నివేత థామస్ నటిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత రెజీనా ప్లేస్ లో తాప్సీ నటించబోతున్నట్లు మళ్ళీ రూమర్స్ వినిపించాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో తాప్సీ నటించట్లేదట, రెజీనానే నటిస్తోంది. కరోనా ప్రభావం తగ్గాక షూటింగ్ ప్లాన్ చేయనున్నారు. ఇక ఈ రీమేక్ కోసం దర్శకుడిగా సుధీర్ వర్మను అనుకుంటున్నారట. సుధీర్ వర్మ గత చిత్రం ‘రణరంగం’ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆయనకు ఈ రీమేక్ అవకాశం రావడం మంచిదనే అనుకోవచ్చు. అయితే ఈ చిత్రంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు