అదరగొడుతున్న ‘దృశ్యం’ కలెక్షన్స్ రిపోర్ట్

అదరగొడుతున్న ‘దృశ్యం’ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Jul 15, 2014 6:51 PM IST

drishyam-review
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘దృశ్యం’. విడుదలైన అన్ని చోట్లా సూపర్బ్ మౌత్ టాక్ తో రోజు రోజుకీ అత్యధికంగా ప్రేక్షకులను థియేటర్స్ కి రాబట్టుకుంటూ బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ రికార్డ్ ని సాధిస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది.

గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే 8 కోట్ల షేర్ ని సాధించింది. ఇది కాకుండా ఒక్క యుఎస్ లో మాత్రమే నాలుగు రోజుల్లో సుమారు 1.5 కోట్ల షేర్ ని సాధించింది. అంటే కేవలం 4 రోజుల్లో సుమారు 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. వెంకటేష్ కెరీర్లో ఇలాంటి కలెక్షన్స్ సాధించడం ఇదే మొదటి సారి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా 5.50 కోట్లకి అమ్ముడు పోయిందని ఇది వరకే తెలియజేశాం.

ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం మొదటి వారం ముగిసే సరికి దృశ్యం సినిమా సుమారు 15 కొర్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. మీనా, నదియా, కృతిక కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి శ్రీ ప్రియ డైరెక్టర్. సురేష్ బాబు – రాజ్ కుమార్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు