రాజమౌళి పేరుతో మోసం చేస్తున్నారు.. జాగ్రత్త

రాజమౌళి పేరుతో మోసం చేస్తున్నారు.. జాగ్రత్త

Published on Sep 1, 2019 7:28 PM IST

ఈమధ్య సోషల్ మీడియా వినియోగం ఎక్కువైన నేపథ్యంలో ఫేక్ అకౌంట్స్ పేరిట కొందరు వ్యక్తులు నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్న ఉదంతాలు అనేకం చూస్తూనే ఉన్నాం. ఇవి సినిమా వ్యక్తులకు సైతం తప్పడంలేదు. తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి పేరిట ఈరకమైన తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు నటీనటులు కావాలంటూ కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు.

అది కూడా రాజమౌళి పేరిట తెరిచిన తప్పుడు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చేస్తుండటం గమనార్హం. దీంతో పలువురు నిజంగానే మిస్ లీడ్ కావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటననైనా నేరుగా మేమే చేస్తాం. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు రాజమౌళి పేరిట ఫేక్ అకౌంట్స్ రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దు.. జాగ్రత్త అంటూ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత దానయ్య రూ.350 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవగన్, అలియా భట్ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. 2020 జూలై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు