ఫైనల్ గా ఓటిటి ఆడియన్స్ ముందుకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’

ఫైనల్ గా ఓటిటి ఆడియన్స్ ముందుకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’

Published on Mar 1, 2024 1:11 AM IST

యువ నటుడు సహాస్, యువ నటి శివాని నగరం ల కలయికలో దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ మూవీని ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి నిర్మించగా శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించి విజయం అందుకుంది.

మ్యాటర్ ఏమిటంటే, నిన్న ఆహా ఓటిటి మాధ్యమం ద్వారా గోల్డ్ యూజర్స్ కి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇక నేటి నుండి ఆహా ఆడియన్స్ అందరికీ అందుబాటులోకి రానుంది. మరి ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ నుండి ఏ స్థాయి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు