4.37 లక్షలకి అమ్ముడుపోయిన యాత్ర ఫస్ట్ టికెట్ !

4.37 లక్షలకి అమ్ముడుపోయిన యాత్ర ఫస్ట్ టికెట్ !

Published on Feb 5, 2019 4:00 AM IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధంగా ఉంది.

అయితే యాత్ర ప్రీమియర్ షో ఫస్ట్ టికెట్ ను అమెరికాలో వేలం వేసారు. మునీశ్వర్‌ రెడ్డి అనే వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి అభిమాని యాత్ర ఫస్ట్ టికెట్ ను 6,116 డాలర్లకు (4.37 లక్షల) కొన్నాడు.

ఇక ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు