సెన్సార్ పూర్తి చేసుకున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

సెన్సార్ పూర్తి చేసుకున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

Published on May 28, 2024 7:00 PM IST

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది రాబోయే గ్రామీణ యాక్షన్ డ్రామా. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా షెట్టి మరియు అంజలి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. రిలీజైన ప్రచార చిత్రాలతో సినిమా పై మంచి అంచనాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. సెన్సార్ బోర్డు వారు చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను అందించారు.

ఈ చిత్రంలో సాయి కుమార్, గోపరాజు రమణ, అయేషా ఖాన్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు