అప్పుడు’ ఫిదా’ ఇప్పుడు ‘గీత గోవిందం’ !

అప్పుడు’ ఫిదా’ ఇప్పుడు ‘గీత గోవిందం’ !

Published on Aug 18, 2018 10:32 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంలో పరుశురాం తెరకెక్కించిన చిత్రం గీత గోవిందం. ఇటీవల విడుదలైన ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలకుకు మాత్రమే సాధ్యమయ్యే కలెక్షన్స్ ను ఈచిత్రం సాధిస్తుంది. ఇక ఈ చిత్రం మరో రేర్ ఫీట్ కు చేరువకానుంది. ఈసినిమా యొక్క ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ హక్కులు 15నుండి 16 కోట్ల మధ్యలో అమ్ముడయ్యాయి. ఈ అమౌంట్ ను ఫుల్ రన్ లో కేవలం నైజాంలోనే రికవరీ చేయనుంది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా రన్ ఎలా సాగుతుందో.

ఇక ఇంతకుముందు ఫిదా ఈరికార్డును సాధిచింది. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు18కోట్ల కు అమ్ముడవ్వగా ఒక్క నైజాం ఏరియాలోనే ఈమొత్తాన్ని రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు