‘మజ్ను’ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ !

‘మజ్ను’ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ !

Published on Jan 17, 2019 4:27 PM IST

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. కాగా తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 19న సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఈవెంట్ హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది.

కాగా ఈ వేడుకకు జూ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు. ఈ విషయం గురించి చిత్రబృందమే పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు