మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇటీవల ఈచిత్రం గురించి అప్డేట్స్ లేకపోవడంతో రవి తేజ అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఇప్పుడు వారికీ గుడ్ న్యూస్. ఈ చిత్రానికి సంభందించిన ఓక ముఖ్యమైన అప్డేట్ ను ఈరోజు సాయంత్రం 6గంటలకు రివీల్ చేయనున్నారు. బహుశా ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ని కానీ లేక టీజర్ విడుదల గురించి ప్రకటన చేసే అవకాశం వుంది.
నిజానికి ఈచిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాల్సివుంది కానీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మొదటగా నాగ చైతన్యనటించిన ‘సవ్యసాచి’ ని విడుదల చేస్తుడడంతో ఈ చిత్రం వెనక్కి వెళ్ళిపోయింది.
కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో రవితేజ మూడు డిఫ్రెంట్ గెటప్స్ లో కనబడనున్నాడు. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించింది.
