మరోసారి వెనక్కి వెళ్లిన గోపీచంద్ సినిమా !


‘గౌతమ్ నంద’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన మ్యాచో మ్యాన్ గోపీచంద్ త్వరలోనే మరొక చిత్రంతో మన ముందుకురానున్నాడు. అదే ‘ఆక్సిజన్’. చాన్నాళ్ల క్రితమే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా పలుసార్లు వాయిదాపడి అక్టోబర్ 12ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. కానీ ఈ డేట్ మరోసారి వెనక్కి వెళ్ళింది. కారణాలు తెలియరాలేదు కానీ సినిమాను అక్టోబర్ 17న కాకూండా 27న విడుదలచేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

ఇప్పటికే రెండు మూడుసార్లు వాయిదాలను చూసిన ప్రేక్షకులు ఈసారైనా చిత్రం చెప్పిన సమయానికి వస్తుందో రాదో అనుకుంటున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ విరివిగా వాడి రూపొందించిన ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మించగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.

Exit mobile version