కొత్త సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ కు గోపీచంద్ !

కొత్త సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ కు గోపీచంద్ !

Published on Jan 19, 2019 6:45 PM IST

పంతం తరువాత గ్యాప్ తీసుకున్న హీరో గోపీచంద్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తిరు దర్శకత్వంలో గోపిచంద్ నటించనున్న 26వ చిత్రం ఇటీవలే లాంఛ్ అయ్యింది. ఇక ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఈనెల 21నుండి రాజస్థాన్ లోని జై సల్మేర్ లో జరుగనుంది. 45 రోజులపాటు జరుగనునున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

అనిల్ సుంకర , అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు