“పక్కా కమర్షియల్” డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ

“పక్కా కమర్షియల్” డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ

Published on Apr 5, 2022 7:05 PM IST

గోపీచంద్ హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రం పక్కా కమర్షియల్‌. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి రాశి ఖన్నా కథానాయికగా నటించింది. ఇప్పుడు, తాజా వార్త ఏమిటంటే, ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫాం ఆహా మంచి మొత్తానికి చేజిక్కించుకుంది.

సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఆహా వీడియో లో ప్రసారం కానుంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ సినిమాలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. UV క్రియేషన్స్ మరియు GA2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 1, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు