మహేష్ జోడీగా ఆమెనే ఫిక్స్ చేశారా ?

మహేష్ జోడీగా ఆమెనే ఫిక్స్ చేశారా ?

Published on Apr 24, 2020 7:26 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ఖాయం అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతవరకు మహేష పక్కన నటించని హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు కీర్తిని చూజ్ చేసుకుని, ఆమెతో సంప్రదింపులు జరిపారని, కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించినా అది విలన్ పాత్ర అయితే కాదు. మరి కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, మహేష్ సినిమాలో విలన్ గా చేయడానికి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. అన్ని కుదిరితే అక్టోబర్ నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు