బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తోటి నటుల పై సరదాగా కామెంట్లు పెడుతూ ఆటపట్టిస్తుంటాడు. అయితే అర్జున్ కపూర్ పెట్టిన ఒక కామెంట్ మాత్రం ఇద్దరి స్టార్ హీరోల అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. అయితే టైగన్ ష్రాఫ్, హృతిక్ రోషన్, దర్శకుడు సిద్దార్థ్ ల కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో హృతిక్, టైగర్ ష్రాఫ్ లు నేల పై కూర్చుని ఉండగా.. డైరెక్టర్ సిద్దార్థ్ పైన కూర్చిలో కూర్చున్నాడు.
ఆ ఫోటో పై అర్జున్ కపూర్ స్పందిస్తూ.. ‘లెజెండ్తో సాధారణ నటులు’ అని సరదాగా కామెంట్ పెట్టాడు. దాంతో హృతిక్, టైగర్ ష్రాఫ్ ల ఫ్యాన్స్ అర్జున్ కపూర్ పై సీరియస్ అవుతున్నారు. డైరెక్టర్ సిద్దార్థ్ ను లెజెండ్ తో పోల్చి.. తమ అభిమాన హీరోలను మాత్రం సాధారణ నటులు అంటావా అంటూ అర్జున్ కపూర్ ను
తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.
https://www.instagram.com/p/B13noF1HNEF/