బాలీవుడ్ లో తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు లో మాత్రమే కాకుండా, మిగతా బాషల్లో కూడా విడుదల కావడం తో సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రత్యేకం గా హిందీ లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది అని చెప్పాలి.

ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ వసూళ్లను రాబడుతూ తగ్గేదేలే అనేలా పుష్పరాజ్ తన హవా చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో పుష్ప ది రైజ్ 80 కోట్ల రూపాయల కి పైగా వసూలు చేయడం జరిగింది. ఆదివారం మరొకసారి 3.40 కోట్ల కి పైగా వసూలు సాధించడం తో 80 కోట్ల రూపాయల కి చేరడం విశేషం. రష్మీక మందన్న ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది. అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, ఫాహద్ ఫజిల్, అజయ్ ఘోష్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version