ఎప్పుడైతే కింగ్ అక్కినేని నాగార్జున బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసాడో అప్పటి నుంచి తన ఫ్యామిలీ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు వస్తున్నాయి.
కానీ తాము రాజకీయాల్లోకి రావడం లేదని నాగార్జున, అమల క్లారిఫై చేసారు. కానీ రాజకీయాల్లోకి రాకపోయినా ఓ పార్టీ తరపున ప్రచారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే నాగార్జున ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోడీని కలిసిన విషయంపై నాగార్జున మాట్లాడుతూ ‘ నేను ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదు. నేను మన దేశానికి మేలు చేస్తాడనుకునే ఓ నాయకుడిని కలిసాను. దేశానికి మంచి చేస్తారు అనుకునే లీడర్స్ ని కలవడం నాకు ఇష్టం. అంతే తప్ప మరే ఉద్దేశంతోనో కాదు. ప్రస్తుతం నేనున్న వృత్తిలో నేను చాలా హ్యాపీగా ఉన్నానని’ అన్నాడు.
అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించిన ‘మనం’ సినిమా మే 23న రిలీజ్ కానుంది. ఇది కాకుండా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. అలాగే మా టీవీలో త్వరలో ప్రారంభం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కోసం సిద్దమవుతున్నాడు.