“జిగార్తండ డబుల్ ఎక్స్” టీవీ ప్రీమియర్ కి టైమ్ మార్పు!

“జిగార్తండ డబుల్ ఎక్స్” టీవీ ప్రీమియర్ కి టైమ్ మార్పు!

Published on Feb 15, 2024 8:30 PM IST

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, ఎస్.జే. సూర్య ప్రధాన పాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జిగార్తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి మరోసారి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు జెమిని టీవీ లో ఈ సినిమా ప్రసారం కానున్నట్లు తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో నిమిశ సజయన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం బుల్లెతెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు