డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్న జర్నీ

డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్న జర్నీ

Published on Jan 20, 2012 4:30 PM IST


తమిళంలో హిట్ అయిన ‘ఎగేయుం ఎప్పోదుం’ చిత్రాన్ని తెలుగులో ‘జర్నీ’ పేరుతో డబ్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2011లో సైలెంట్ హిట్ గా నిలిచింది. జర్నీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికీ చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది.

తూర్పు జిల్లాలో ఈ చిత్రాన్ని 5 లక్షలు వెచ్చించి కొనగా ఇప్పటి వరకు 46 లక్షలు షేర్ వసూలు చేసింది. లాంగ్ రన్ లో 53 లక్షల వరకు వసూలు చేయొచ్చు. నైజాం ఏరియాకు గాను 35 లక్షలకు కొనుగోలు చేయగా ఇప్పటి వరకు ఒక కోటీ 95 లక్షలు షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం పట్ల తెలుగులో పంపిణీ చేసిన సురేష్ కొండేటి చాలా ఆనందంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు