పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు విశాఖ సముద్ర తీరాన మహా శివరాత్రి నాడు కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో 27 వ మహా కుంబాభిషేకం 20వ తేది సోమవారం నాడు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 10.౦౦ గంటల వరకు పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసు రావు సంగీత నిర్వహణలో ప్రముఖ గాయని గాయకులూ భక్తి సంగీత విభావరి నిర్వహిస్తారు. ఆ సందర్బంగా సాయంత్రం 5.00 గంటలకు ప్రముఖ చలన చిత్ర దర్శకులు రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ” బిరుదు ప్రదానం జరుగుతుంది. ఆ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర రావాణ శాఖ మాత్యులు మరియు కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ బొత్స సత్యనారాయణ పాల్గొంటారు. పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. గౌరవ అతిధులుగా పర్యాటక శాఖ మాత్యులు శ్రీ వట్టి వసంత కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పి,బాలరాజు, రాష్ట్ర మౌలిక సదుపాయాలు మరియు రేవుల శాఖ మాత్యులు శ్రీ ఘంటా శ్రీనివాస రావు, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ శ్రీ R.V. రమణ మూర్తి మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొంటారు. విశిష్ట అతిధిగా డా.డి.రామానాయుడు, ప్రత్యేక అతిధులుగా పద్మశ్రీ డా.కె.బ్రహ్మానందం, సిని నటీమణులు భానుప్రియ, మంజు భార్గవి, తులసి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని టి.సుబ్బరామి రెడ్డి లలితకళా పరిషత్ నిర్వహిస్తుంది.
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం”
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం”
Published on Feb 16, 2012 11:31 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?
- SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?