నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం – కృతిశెట్టి

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. నిన్న వరంగల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.

ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అందరి పర్ఫామెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. థియేటర్లోనే సినిమాను చూడండి. అందరూ మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. నా రెండో సినిమానే ఆయనతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. నిర్మాత వెంకట్ గారు ఎంతో స్వీట్ పర్సన్. రాహుల్‌ గారిది ఇదో రెండో సినిమా అని అనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించారని అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ ‘శ్యామ్ సింగ రాయ్’ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్బుతంగా చూపించారు. కెమెరామెన్, క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందే. అన్ని సినిమాలను థియేటర్లోనే చూడండి. శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత గారు అనుకున్నారు’ అని అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ ‘శ్యామ్ సింగ రాయ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్బుతంగా చూపించారు. కెమెరామెన్, క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందే. అన్ని సినిమాలను థియేటర్లోనే చూడండి. శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత గారు అనుకున్నారు’ అని అన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ‘ఇక్కడ ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. నాని కూడా ఇంతకు ముందు కూడా ఇక్కడ సినిమాను తీశాడు. మా ఇంట్లో భోజనం కూడా చేశాడు. సాయి పల్లవి కూడా మా ఇంట్లో భోజనం చేసింది. ఏ సినిమా అయినా ఇక్కడి నుంచే మొదలుపెట్టండి. హైద్రాబాద్ కన్నా వరంగల్ ఎంతో మంచిది. సినీ పరిశ్రమకు నా వంతు సాయంచేస్తానని అన్నారు.

దిల్ రాజ్ మాట్లాడుతూ ‘సిరివెన్నెల శాస్త్రిగారు ఎక్కడున్నా మనల్ని చూస్తుంటారు. మీ పాటలను మేం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. నిర్మాత వెంకట్ గారు ఒక హిట్ సినిమా తీయాలని అనేవారు. ఆయనకు నాని దొరికారు. దర్శక నిర్మాతలు కొత్తవారైనా కూడా నాని ఈ సినిమాను భుజ స్కంధాల మీద మోశారు. మామూలుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నాచురల్ స్టార్‌గా ఎదిగారు. సినిమా సినిమాకు ఎదిగి ఇండస్ట్రీలో ఒక స్టార్‌గా ఎదిగారు. ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలి. నీ నమ్మకమే ఈ సినిమా. అది అందరికీ తెలుసు. 24న అది నిజమవ్వాలి. టీజర్ రోజున ఆ విషయాన్ని నాని కూడా చెప్పాడు. మా ఫిదా హీరోయిన్ సాయి పల్లవి. ఆమె ఏ సినిమాలో కనిపించినా కూడా అద్భుతంగా నటిస్తారు. మళ్లీ సాయి పల్లవి మ్యాజిక్ చేస్తారు. ఇక బేబమ్మ కూడా మొదటి సినిమాతో మంచి హిట్ కొట్టింది. మళ్లీ ఈ సినిమాతో వస్తోంది. దయాకరన్న వల్లే ఈ ఈవెంట్‌ను ఇక్కడ ప్లాన్ చేశాం. ఆయనే అన్నీ ఏర్పాట్లు చూసుకుంటారు. ఎంసీఏ షూటింగ్, ఈవెంట్‌ను ఇక్కడే చేశాం. అదే సెంటిమెంట్ ఫాలో అవ్వాలని ఈ రోజు ఈవెంట్‌ను ఇక్కడ చేయాలని హీరో, నిర్మాతలు అడిగారు. మాస్కులు ధరించి థియేటర్లకు వెళ్లండి’ అని అన్నారు.

నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ ‘ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూడండి. మా నాని గారు, సాయి పల్లవి గారిని, కృతి శెట్టి గారిని ఆశీర్వదించండని అన్నారు.

Exit mobile version