‘కుబేర’ లేటెస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ కుబేర. ఈమూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండగా కీలక పాత్రల్లో నాగార్జున, ధనుష్ నటిస్తున్నారు.

ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కాగా ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రధారుల పై కొన్ని కీలక సన్నివేశాలు భారీ ఎత్తున చిత్రీకరించనుంది టీమ్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన కుబేర టైటిల్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

Exit mobile version