లేటెస్ట్ : హీరోయిన్ తమన్నా పై కేసు.. వివరాలు ఇవే

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి ఆదరణ ఉన్న హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. పలు వెబ్ సిరీస్ లలో ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా రీసెంట్ గా అయితే సూపర్ స్టార్ “జైలర్” లో కనిపించింది. అలాగే మరో పక్క కన్నడ చిత్రం “బాక్” తో ఈ మే లో రాబోతుంది. అయితే తమన్నా వీటితో పాటుగా పలు ఎండోర్స్ మెంట్స్ కి కూడా ప్రమోట్ చేస్తుంది అని తెలిసిందే.

ఇప్పుడు అలా చేసిన ఓ ప్రమోషన్ ఆమెపై కేసు పడేలా చేసింది. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే ప్రస్తుతం భారదేశంలో మోస్ట్ పాపులర్ క్రికెట్ ఫార్మాట్ ఐపీఎల్ జరుగుతున్నా సంగతి తెలిసిందే. అయితే దీనికి అధికారికంగా ప్రసారం చేసే హక్కులు బుల్లితెరపై స్టార్ సంస్థకి ఓటిటిలో జియో, వియాకామ్ 18 అనుబంధ జియో సినిమా యాప్ లో మాత్రమే చూసే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో వీటికి కూడా అనధికారికంగా స్ట్రీమ్ చేసే ఎన్నో ఇతర మాధ్యమాలు ఉన్నాయి. మరి వీటిలో ఓ బెట్టింగ్ యాప్ ఫెయిర్ ప్లే అనే యాప్ ని ఆమె ప్రమోట్ చేస్తూ అందులో కూడా ఐపీఎల్ ని చూడొచ్చని ప్రమోట్ చేసింది. దీనితో ఇలా ఎలా ప్రమోట్ చేస్తారని వియాకామ్ 18 వారు మహారాష్ట్ర కోర్టుకెక్కారు. దీనితో ఆమెపై ఇప్పుడు సైబర్ కేసు నమోదు అయ్యింది. దీనితో ఆమె ఈ ఏప్రిల్ 29 లోపు వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై తమన్నా ఏం చేస్తుందో చూడాలి.

Exit mobile version