కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “కాంతార”. మరి ఈ చిత్రం గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఓ డివోషనల్ హిట్ కాగా సుమారు 400 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని ఆ ఏడాది కన్నడ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక ఈ చిత్రంకి రిషబ్ ఓ ప్రీక్వెల్ ని కూడా అనౌన్స్ చేయడంతో మరిన్ని అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఆకస్మికంగా మేకర్స్ ఓ సాలిడ్ అనౌన్సమెంట్ ని అందించారు. అప్పుడే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అంటూ డేట్ మరియు టైం ని ఇప్పుడు లాక్ చేసేసారు.
ఈ నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 నిమిషాలకి “కాంతార పార్ట్ 1” ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. పైగా ఈ అనౌన్సమెంట్ పోస్టర్ లో ఉన్న లైన్ మరింత ఆసక్తిగా “అది కేవలం వెలుగు మాత్రమే కాదు అది దర్శనం” అంటూ లైన్ పెట్టారు. దీనితో ఈ సినిమా ఇంకెత డివోషనల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ದೈವಿಕ ಸ್ಪರ್ಶವನ್ನು ಅನುಭವಿಸುವ ಜತೆ ಇತಿಹಾಸದ ನಿಗೂಢ ಸತ್ಯವನ್ನು ಅನ್ವೇಷಿಸಿ. ಹಿಂದೆಂದಿಗೂ ನೋಡದ ವಿಸ್ಮಯವನ್ನು ಕಣ್ತುಂಬಿಕೊಳ್ಳಲು ಕಾತುರರಾಗಿ. ಇದು ಬರಿ ಬೆಳಕಲ್ಲ, ದರ್ಶನ ????
Step into the sacred echoes of the past, where divinity weaves through every frame. Stay enchanted for a glimpse into… pic.twitter.com/jiuwyqQRaP
— Hombale Films (@hombalefilms) November 25, 2023
