రామ్ “డబుల్ ఇస్మార్ట్” షూటింగ్ పై లేటెస్ట్ బజ్!

రామ్ “డబుల్ ఇస్మార్ట్” షూటింగ్ పై లేటెస్ట్ బజ్!

Published on Jun 11, 2024 5:00 PM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్‌ కి ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. కావ్యా థాపర్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం హైదరాబాద్‌లో రెండు పాటలు, గోవాలో మరొక పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాటలు మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది. ఆగస్ట్ లేదా సెప్టెంబరులో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి కౌర్, పూరీ జగన్నాధ్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు