‘SSMB 29’ పై లేటెస్ట్ క్రేజీ బజ్

‘SSMB 29’ పై లేటెస్ట్ క్రేజీ బజ్

Published on Jan 20, 2024 3:03 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా గుంటూరు కారం మూవీతో కెరీర్ పరంగా మరొక సక్సెస్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఇక ఈ మూవీ అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో తన నెక్స్ట్ మూవీ SSMB 29 చేయనున్నారు మహేష్ బాబు. ఈ పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ ప్రాజక్ట్ పై ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ లాక్ అయిందని తాజాగా కథకుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చెప్పారు.

విషయం ఏమిటంటె, ఈ మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ క్రేజీ బజ్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ ప్రొడక్షన్ పార్టనర్ గా మరొక సంస్థ కూడా ఉండనున్నట్లు చెప్తున్నారు. కాగా అది హాలీవుడ్ కి చెందిన సంస్థ అని టాక్. అలానే టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా ఇందులో పార్ట్నర్ గా ఉంటారని మరొక టాక్ ఉంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై పక్కాగా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు