SSMB29: సంబంధం లేని రూమర్స్ కి చెక్ పెట్టేసిన మేకర్స్

SSMB29: సంబంధం లేని రూమర్స్ కి చెక్ పెట్టేసిన మేకర్స్

Published on May 17, 2024 8:48 AM IST


గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కనున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఇది మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కనుండగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ గ్యాప్ లో కొన్ని రోజుల కితమే ఈ సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామి ఈ భారీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అని జాతీయ కథనాలు వచ్చాయి. దీనితో ఈ రూమర్స్ పై మేకర్స్ అఫీషియల్ గా స్పందించారు. నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ అధినేత కాజా లక్ష్మి నారాయణ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆ కథనంలో ప్రచురుంచిన వార్తలో అసలు ఎలాంటి నిజం లేదని, క్యాస్టింగ్ విషయంలో వచ్చిన ఆ వార్త పూర్తిగా అవాస్తవం అని తెలిపారు.

అలాగే విరేన్ స్వామికి ఈ ప్రాజెక్ట్ కి అసలు సంబంధం లేదని అతను ఈ ప్రాజెక్ట్ కి ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ కాలేదు అని కుండ బద్దలు కొట్టేసారు. అలాగే ఏదైనా విషయం ఉంటే అధికారికంగా తాము మాత్రమే ప్రకటిస్తామని కూడా తెలియజేసారు. సో ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో వచ్చిన వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు