మహేష్, సితారల సరదా అల్లర్లు, వైరల్ అవుతున్న పిక్స్

మహేష్, సితారల సరదా అల్లర్లు, వైరల్ అవుతున్న పిక్స్

Published on Apr 24, 2020 3:51 PM IST

లాక్‌డౌన్ కారణం గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికే పరిమితం అవుతున్నారు . దీనితో మహేష్ సరదాగా పిల్లలతో గడుపుతున్న క్షణాలను కెమెరాలో బంధించి ఎప్పటికప్పుడు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లేటెస్టుగా మహేష్‌కి సితార హెడ్ మసాజ్ చేసిన ఫొటోలు షేర్ చేశారు.”గౌతమ్ తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. మహేష్ బాబుకి హెడ్ మసాజ్ చేసే వాలంటీర్ ఉన్నారు. కేవలం రెండు నిమిషాల్లో హెడ్ మసాజ్ ఫినిష్ చేసే వాలంటీర్. ఎలా ఉందని అడిగితే మహేష్ బావుందని చెప్పారు” అని నమ్రత పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఫ్యాన్స్ వాటిని చూస్తూ తండ్రి కూతుళ్ళ సరదా అల్లర్లు మాములుగా లేవని చెప్పుకుంటున్నారు. ఇక మహేష్ త్వరలో తన కొత్త మూవీ కి సంబంధించిన ప్రకటన చేయాల్సి వుంది. ఆయన తన తండ్రి గారైన కృష్ణ పుట్టిన రోజు మే 31కావడంతో ఆ రోజు ప్రకటించే అవకాశం కలదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు