స్వంత ఊరికి వెళ్లనున్న శ్రీమంతుడు..?

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లో తన స్వంత ఊరైన బుర్రిపాలెం మరియు తెలంగాణాలో మహబూబ్ నగర్ జిల్లాలో సిద్ధాపూర్ ని దత్తతకు తీసుకుని ఆ గ్రామాలను స్మార్ట్ విలేజ్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే క్రిందటి నెలలో మహేష్ భార్య నమ్రత బుర్రిపాలెం సందర్శించి ఆ గ్రామం అభివృద్ధి గురించి చర్చించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఇటీవల సిద్దాపూర్ ని సందర్శించిన నమ్రత అక్కడ హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంల్ మెడికల్ కాంప్ నిర్వహించిది. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కి సంబంధించిన చర్యలపై త్వరలోనే మహేష్ మంత్రి కె టి ఆర్ తోనూ, కలెక్టర్ అరుణతోనూ మాట్లాడతారని చెప్పింది. మాకు అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు త్వరలోనే బుర్రిపాలెం సందర్శించి అక్కడ చేయాల్సిన అభివృద్ది పనులపై చర్చిస్తారని తెలిసింది.

Exit mobile version