ఆ హిట్ డైరెక్టర్ తో మహేష్ సినిమా లేనట్లే !

ఆ హిట్ డైరెక్టర్ తో మహేష్ సినిమా లేనట్లే !

Published on Aug 15, 2019 8:00 PM IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న పరుశురామ్, తన తరువాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా పరుశు రామ్ చెప్పిన స్క్రిప్ట్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మహేశ్ కూడా మొదట సినిమా చెయ్యడానికి వెంటనే అంగీకరించడు.

కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ – మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఆగిపోయిందట. మహేష్ ప్రస్తుతం బిజీగా ఉండటం వల్లే తాను పరుశురామ్ తో సినిమా చేయలేకపోతున్నాని కొరటాల శివ ద్వారా పరుశురామ్ కి చెప్పాడట. ప్రస్తుతం మహేశ్ బాబు అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లితో ఓ మూవీ మొదలుకానుంది. మరి పరుశురామ్ ఏ హీరోతో చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు