మెగాస్టార్ చిరంజీవి హీరోగా విక్టరీ వెంకటేష్ కామియో రోల్ లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చి భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా నైజాం మార్కెట్ లో కూడా అదే రీతి స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ ని చేస్తుంది. మరి లేటెస్ట్ గా నిన్నటి నైజాం లెక్కలు బయటకి వచ్చాయి.
పి ఆర్ లెక్కల ప్రకారం సంక్రాంతి రోజున 5 కోట్లకి పైగా షేర్ ని రాబట్టింది అని తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే ఈ సినిమా 5.5 కోట్ల షేర్ ని అందుకోగా మొత్తం 21 కోట్ల షేర్ ని టచ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో మన శంకర వరప్రసాద్ గారు హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.


