మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో వింటేజ్ లుక్స్తో చిరు చేయబోయే సెన్సేషన్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక రీసెంట్గా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవగా, దానికి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. మెగాస్టార్ మరోసారి తనదైన మ్యానరిజం, పర్ఫార్మె్న్స్తో ట్రైలర్లో చెలరేగిపోయాడు. అనిల్ రావిపూడి మార్క్ టేకింగ్, కామెడీ టైమింగ్తో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్గా ఉండటంతో ప్రేక్షకులు ఈ ట్రైలర్కు ఫిదా అవుతున్నారు. రిలీజ్ అయిన 24 గంటల్లో ఈ ట్రైలర్కు ఏకంగా 25 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. దీంతో ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి ఫీట్లు చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్గా నటించగా, స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ క్యామియో పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ చిత్రం జనవరి 12న వరల్డ్వైడ్ రిలీజ్కు రెడీ అయింది.
