సాలిడ్ వసూళ్లతో అదరగొడుతున్న మెగాస్టార్ “భ్రమయుగం”

సాలిడ్ వసూళ్లతో అదరగొడుతున్న మెగాస్టార్ “భ్రమయుగం”

Published on Feb 25, 2024 12:00 PM IST

మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భ్రమయుగం” కోసం ఇప్పుడు అందరికీ తెలిసిందే. మరి అనౌన్సమెంట్ తోనే మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం తర్వాత టీజర్ ట్రైలర్ లతో కూడా మళయాళ సినిమా నుంచి మరో సరికొత్త ఎక్స్ పీరియన్స్ వస్తుంది అని అంతా భావించారు. ఇక దర్శకుడు రాహుల్ సదా శివన్ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గానే తెలుగులో కూడా విడుదల అయ్యింది.

అయితే మోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాలిడ్ నంబర్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది. దీనితో ఈ చిత్రం రానున్న రోజుల్లో మరింత బెటర్ వసూళ్లు అందుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించగా నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి వారు వై నాట్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు