టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా కథ, గ్రాఫిక్స్ వంటి అంశాలు ప్రేక్షకులను మెప్పించంలో సక్సెస్ అయ్యాయి.
ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ గతంలో వెల్లడించారు. దీంతో ఈ చిత్ర సీక్వెల్కు సంబంధించిన షూటింగ్ను మేకర్స్ నేటి(మే 19) నుంచి ప్రారంభించారు. ఈ చిత్ర షూటింగ్ను వైజాగ్లో ప్రారంభించారట చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ 10 రోజుల పాటు సాగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
తేజ సజ్జా మరోసారి తన పాత్రలో ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతుండగా రానా దగ్గుబాటి ఈ సీక్వెల్ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. తొలి భాగంలో నటించిన మంచు మనోజ్ కూడా తన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందించనుంది.
