బాలనాగమ్మ చిత్రాన్ని నిజమైన తెలుగు ఆణిముత్యం గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలై 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఏడుగురు యువరాజులు ఏడుగురు యువరాణులని వివాహమాడతారు. మాంత్రికుడు అతి పిన్న వయస్కురాలైన యువరాణి ని బలవంతంగా ఎత్తుకోనిపోతాడు. ఆ యువరాణి కొడుకు కనిపించని చెట్టులో ఉన్న పిట్టని కనిపెట్టి మాంత్రికుడిని ఎలా చంపాడు అన్నదే చిత్ర కథ. పతాక సన్నివేశాలు రామాయణ మరియు మహాభారతాలను తలపిస్తాయి. ఈ చిత్రంలో బాల నాగమ్మగా కాంచనమాల నటించగా సంగు గా పుష్పవల్లి మరియు రేలంగి కూడా నటించారు. ఈ సినిమాకి అసలైన మాంత్రికుడు కెమెరామెన్ ఎమ్. ఇరానీ అని చెప్పుకోవాలి. ఇండియన్ సినిమాని సరికొత్త దారిలో తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఆన్ని శాఖలు సరిగా పనిచేయడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరిన్ని జానపద చిత్రాలు ఇంకా చాలా వచ్చాయి. ఈ చిత్రనికి గొప్ప దర్శకుడు కె.వి రెడ్డి (మాయా బజార్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జెమిని ఫిల్మ్స్ వారికీ కాసుల వర్షం కురిపించింది. బాలనాగమ్మ చిత్రం హిందీ కూడా నిర్మించగా మధుబాల హీరోయిన్ గా నటించగా మహానటి సావిత్రి గారు సంగు పాత్ర పోషించారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
- “పుష్ప 2 ది రూల్” కి బాగా ప్లస్ అవుతున్న బన్నీ మ్యానరిజం!
- “డబుల్ ఇస్మార్ట్” తో రామ్ 100 కోట్ల క్లబ్ లో చేరతాడా?
- “పుష్ప 2” కోసం ఫాహద్ ఫాసిల్ ఇన్ని రోజుల కేటాయింపు!?
- “సలార్ 2” లో ప్రభాస్ భారీ డైలాగ్!?
- విడాకులు తీసుకున్న జివి ప్రకాష్ కుమార్ – సైంధవి
- విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!