త్వరలో రాబోతున్న నితిన్ ‘ఇష్క్’ ఆడియో వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిదిగా రాబోతున్నారు. నితిన్ స్వయంగా గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని ఆడియో వేడుకకి రమ్మని ఆహ్వానించారు. దాసరి నారాయణ రావు మరియు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ వేడుకకి రాబోతున్నారని సమాచారం. డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని అర్బన్ లవ్ స్టొరీ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇటీవలే కేరళ మరియు కులుమనాలిలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఆడియో వేడుక ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “విశ్వంభర” కోసం ఇన్ని గ్రాండ్ సెట్టింగ్స్..
- టాక్.. “ఇండియన్” కోసం “గేమ్ చేంజర్”?
- అందుకు థమన్ కి థాంక్స్ తెలిపిన గోపిచంద్ మలినేని!
- ‘వార్ 2’ కోసం భారీ యాక్షన్ సెట్
- విజయ్ ని ట్రోల్ చేసినా.. తన స్టార్ పవర్ ని మెచ్చుకోవాల్సిందే
- ఆకట్టుకుంటున్న తమన్నా “బాక్” ట్రైలర్!
- ఓటిటి లోకి వచ్చిన డియర్…ఇక్కడైనా మెప్పిస్తుందా?