వారిని హెచ్చరిస్తున్నాను – మోహన్ బాబు

వారిని హెచ్చరిస్తున్నాను – మోహన్ బాబు

Published on Feb 26, 2024 3:36 PM IST

మోహన్ బాబు పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నట్టు ఆయన దృష్టికి వెళ్ళింది. దీంతో మోహన్ బాబు తాజాగా ఈ విషయం పై స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ, మోహన్ బాబు తన పోస్ట్ లో ఏం పెట్టారంటే.. ‘ఈ మధ్య కాలంలో నా పేరుని ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలి గాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి , సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను’ అంటూ మోహన్ బాబు తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు