‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేసిన మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. అయితే మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టడంలో విఫలమవుతుంది.
కాగా విడుదలైన తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొత్తం 10.5 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఈ లెక్కన ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే.


