మార్చి 11న రానున్న జాతిరత్నాలు !

మార్చి 11న రానున్న జాతిరత్నాలు !

Published on Jan 24, 2021 12:19 PM IST

టాలెంటెడ్ యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై ఎంట్రీ ఇవ్వ‌డమే కాకుండా, తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో అతడి కామెడీ టైమింగ్‌కి చాలామంది ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా యూత్‌లో న‌వీన్ కి క్రేజ్ అమాతం పెరిగిపోయింది. అదే క్రేజ్ తో అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా చేశాడు.

కాగా ప్రస్తుతం జాతిరత్నాలు సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మార్చి 11న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందని.. ఫుల్ ఎంటర్ టైనర్ గా సూపర్ హిట్ గా నిలుస్తోందట. ఇక ఇటీవలే బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంలో న‌వీన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న‌ట్లు వార్తలు రావడం, వాటి పై నవీన్ స్పందిస్తూ.. ‘ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేద‌ని.. అదంతా కేవలం పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఏమైనా జాతిరత్నాలు గాని హిట్ నవీన్ రేంజ్ మారిపోతుంది. హీరోగా అతనికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు