సెప్టెంబర్ 10న విడుదల కానున్న “నిన్ను తలచి”.

సెప్టెంబర్ 10న విడుదల కానున్న “నిన్ను తలచి”.

Published on Aug 16, 2019 9:16 PM IST

ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం “నిన్ను తలచి”. వంశీ యాకసిరి, స్టెఫీ పటేల్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, అలాగే రాఖీ పూర్ణిమను పురస్కరించుకొని, నిన్న మూవీ కొత్త పోస్టర్ విడుదల చేయడం జరిగింది. చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే నెల 10న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

ఈ సంధర్భంగా నిర్మాత అజిత్ కుమార్ మాట్లాడుతూ… ఒక హానెస్ట్ అట్టెంప్ట్ చేసాము, ఈ సినిమాను కేవలం ఒక ప్రేమ కథలా కాకుండా అటు ఫ్యామిలీ ఇటు యూత్ ని ఆకట్టుకునేలాతీయడం జరిగింది. మా సినిమాకు మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని నేను బలం గా నమ్మతున్నా, త్వరలోనే ఈ మూవీలోని వీడియో సాంగ్స్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. వంశీ, స్టెఫీ పటేల్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నం అన్నారు.

దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ… అనుకున్న బడ్జెట్, అనుకున్న టైం లో ఈ సినిమాను పూర్తి చేయగలిగాము, నా కథని నమ్మి సినిమా తీయడానికి ముందుకు వచ్చి, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇస్తున్న వంశీ, అసలు కొత్త వాడిలా అనిపించడు, ఈ సినిమాకి వంశీ నటన కచ్చితంగా ప్లస్ అవుతుంది అని నేను నమ్మతున్నా. అలానే స్టెఫీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ అవుతున్నాం, త్వరలోనే వీడియో సాంగ్స్ , ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు.

జబర్దస్త్ మహేష్, కేదార్ శంకర్ ఇతర తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మహావీర అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు