టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్?

టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్?

Published on Feb 26, 2024 2:03 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఏరియల్ యాక్షన్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్‌. మానుషి చిల్లర్ మహిళా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 1, 2024న తెలుగు మరియు హిందీలో వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది, ఈ వేడుకకు పద్మవిభూషణ్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ ఈ సినిమా కి సంబందించిన శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు