‘సైరా’ వేడుకకు చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణేనా ?

‘సైరా’ వేడుకకు చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణేనా ?

Published on Sep 6, 2019 3:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘సైరా’కు త్వరలో ప్రమోషన్లు మొదలుకానున్నాయి. వీటిని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ ప్రాంతాకి చెందిన విశిష్ట వ్యక్తి కావడంతో ప్రీ రిలీజ్ వేడుకను కర్నూల్ ప్రాంతంలోనే చేయాలని అనుకుంటున్నారట. అయితే ఆ ప్రాంతానికి అమితాబ్ లాంటి వారిని తీసుకురావడం కుదరదు కాబట్టి చిరు స్థాయికి తగ్గట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అతిథిగా పిలిస్తే బాగుంటుందని మెగా కాంపౌండ్ భావిస్తున్నట్టు టాక్.

ఇక మిగతా మెగా హీరోలంతా ఎలాగూ హాజరవుతారు కాబట్టి స్టార్లతో వేదిక ఎలాగూ కళకళలాడుతుంది. అలాగే హైదరాబాద్ లాంటి చోట్ల చేయబోయే వేడుకకు అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లు ఖచ్చితంగా హాజరవడం ఖాయం. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదలకానుంది. రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు