టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయ్యిన పాయల్ రాజ్ పుత్ మరో థ్రిల్లర్

టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయ్యిన పాయల్ రాజ్ పుత్ మరో థ్రిల్లర్

Published on Jan 21, 2024 5:12 PM IST

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు థ్రిల్లింగ్ హిట్ చిత్రాల్లో పాయల్ రాజ్ పుత్ మరియు దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం “మంగళవారం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం సాలిడ్ హైప్ మధ్య వచ్చి అంచనాలు అందుకొని బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక అలాగే పాయల్ రాజ్ పుత్ కూడా ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ని అందుకోగా ఈ సినిమా కన్నా ముందు పాయల్ మరో థ్రిల్లర్ ని చేసింది.

ఆ సినిమానే “మాయా పేటిక”. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో అనుకున్న రేంజ్ రెస్పాన్స్ అందుకోలేదు. మరి దర్శకుడు రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మరి ఈ సినిమా హక్కులు ఈటీవీ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ జనవరి 28న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి టెలికాస్ట్ కానున్నట్టుగా ఫిక్స్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు