హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఇప్పటికే ఈ సినిమా పై చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా ఘాట్ ను స్టార్ట్ చేయనున్నారు. మొదటి షెడ్యూల్ లో శర్వానంద్ ఎంట్రీ సీన్స్ ను ఘాట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
అన్నట్టు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
