“ఆదిపురుష్” స్టార్ట్ అయ్యేది ఈ డేట్ నుంచే..మరో స్పెషల్ కూడా.!

“ఆదిపురుష్” స్టార్ట్ అయ్యేది ఈ డేట్ నుంచే..మరో స్పెషల్ కూడా.!

Published on Jan 19, 2021 10:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల కోసమే ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్. అయితే మరి కొన్ని రోజుల కితమే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో “సలార్” అనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ను స్టార్ట్ చేసేసాడు. మరి ఇప్పుడు మరో విభిన్న చిత్రం “ఆదిపురుష్” కూడా స్టార్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజే ఆ చిత్ర దర్శకుడు ఓంరౌత్ ఈ భారీ సినిమాకు ఎంతో కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ ను స్టార్ట్ చేసేసారు.

అయితే మరి ఈ చిత్రం కూడా ఈ ఏడాది నుంచే స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. దానికి ముహుర్తాన్ని కూడా మేకర్స్ ఫిక్స్ చేసేసారు. ఈ చిత్రాన్ని అధికారికంగా వచ్చే ఫిబ్రవరి 2న స్టార్ట్ చెయ్యడం కన్ఫర్మ్ చేశారు. అంటే మరి ప్రభాస్ ఏక కాలంలో “సలార్” మరియు “ఆదిపురుష్” చెయ్యనున్నట్టే.. కాకపోతే సలార్ వేగంగా పూర్తయిపోతుంది కానీ ఆదిపురుష్ సమయం తీసుకోనుంది.

అయితే మరో స్పెషల్ కూడా ఈ చిత్రంలో ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు గాను మన ఇండియన్ సినిమాలో దేనికీ కూడా ఉపయోగించని లేటెస్ట్ గ్రాఫికల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారట. మొత్తానికి ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ పై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనుండగా మొత్తం 5 భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు