బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని అంటింది. పాన్ ఇండియా స్టార్ హీరో గా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ఇండియా లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ అయోధ్య లో ప్రారంభం కానున్నాయి.
ఇప్పుడు, హిందీలో ప్రభాస్ తన కోసం డబ్బింగ్ చెప్పలేదని తాజాగా వార్తలు వచ్చాయి. మరియు బాహుబలి చిత్రానికి ప్రభాస్ కోసం డబ్బింగ్ చెప్పిన నటుడు షార్డ్ కేల్కర్ చెప్పినట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు కాస్త బాధలో ఉన్నారు. ఈ సినిమాకు అన్ని భాషల్లో తమ స్టార్ హీరో డబ్బింగ్ చెప్పాలని భావించారు. అయితే హిందీలో అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఈ పాత్రను చేస్తే బాగుంటుందని మేకర్స్ భావించడంతో శరద్ని ఎంపిక చేశారు.


